రాజశేఖరరెడ్డి కక్ష సాధింపు చర్యలన్నీ ప్రత్యర్దులను లొంగదీసుకొవడానికే వుండేయి. ఆర్దికంగా దెబ్బ తీయ్యడానికే వుండేయి. ఎప్పుడూ కూడా ఇలా సి.బి.ఐ తో విచారణలు చేపిస్తూ జైల్లోకి పంపించి అవమానించే రేంజ్లో అవకాశం వచ్చినా చెయ్యలేదు.
రాజకీయం అంటేనే దోపిడికి రాజమార్గం అయినపుడు, తామేదో నీతివంతులం అయినట్టు జగన్పై కక్ష సాధించడం యావత్ భారతదేశం ఖండిస్తుంది. రాబోయే ఎన్నికలలో తమ ప్రతాపం చూపిస్తారు. రాజకీయ నాయకులంతా ఏకం కావాలి. ఈ రేంజ్లో కక్ష సాధింపు చర్యలకు స్వస్తి పలకాలి.
అందరూ దొంగలై వుండి ఇలా ఒకరిపైనే పడటం దారుణం. ఇది కేవలం కాంగ్రెస్ ను ఎదిరించడం వలెనే కదా!
ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ కుట్రల వలన ఇబ్బందులు పడిన చిరంజీవి, కాంగ్రెస్ వైపు వుండటం ఏమిటో?