మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం కంచె. ఇటివలే షూటింగ్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. 1940 ల లో సాగే ఒక కథ ను దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కించే ప్రయత్నం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు .
ఈ చిత్రం నుండి ఒక ఫోటో ని హీరో వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా రిలీజ్ చేశాడు. వరుణ్ తేజ్ మొదటి సినిమా ముకుంద విజయం సాధించకపొవడంతో ఈ సినిమా ‘కంచె’ పై అంచనాలు ఏమీ లేవు. టీజర్ రిలీజ్ చేసాక ఏమైనా బిల్డ్ అవుతాయెమో చూడాలి.