కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠి నాయకా నాయికలుగా రూపొందిన చిత్రం ‘సొగ్గాడే చిన్ని నాయనా’. నాగార్జున నిర్మించిన ఈ చిత్రంలో అనసూయ, హంసా నందిని తదితరులు కూడా ముఖ్య పాత్రలు వహించినట్టు వున్నారు. సర్దార్ గబ్బర్సింగ్ సినిమా తర్వాత పవన్కల్యాణ్ సినిమాకు మ్యూజిక్ అందించే అనూప్ రూబెన్స్, ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.
ఈ సినిమాకు ముందు వచ్చిన నాగార్జున సినిమా “మనం”. ఈ సినిమా ఒక అద్బుతం. ఒక కాంప్లీకేట్ కథను చాలా సింపుల్గా చెప్పటమే కాదు, నాగార్జున ఫ్యామిలీ మాత్రమే చేయగలదు అనే విధంగా ఈ సినిమాను అక్కినేని ఫ్యామిలి రక్తి కట్టించారు.
మనం సినిమా క్రియేట్ చేసిన మ్యాజిక్ను రిపీట్ చెయ్యడానికి వస్తున్న మరో సినిమా ‘సొగ్గాడే చిన్ని నాయనా’. ప్రయత్నం అయితే చేసారు. ఈ ప్రయత్నం మనం రేంజ్లో సక్సస్ అవుతుందో లేదో తెలియాలంటే జనవరి 15 దాకా వెయిట్ చేయవల్సిందే. పబ్లిసిటీలో భాగంగా సినిమా మెయిన్ సీక్రెట్ను చెప్పేసారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు, అమ్మోరు, బాహుబలి తర్వాత రమ్యకృష్ట మరోసారి ప్రేక్షకుల హృదయాలను దోచుకునేలా వుంది.
httpv://youtu.be/P_VAwHnLPiE