ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ నగరంలో నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. సాటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించలేదనే అసంతృప్తితో ఆహ్వానాన్ని తాను తిరస్కరించినట్టు సహస్రావధాని గరికపాటి నరసింహారావు అంటున్నారు. 5 కోట్ల తెలుగు ప్రజలకు ప్రతినిధి అయిన ఏపీ సీఎంను పిలవకుండా తనను పిలిస్తే ఎలా వెళతానని అంటున్న ఆయన ఆవేదనలో అర్దం వుంది. నిజం వుంది. చంద్రబాబు & కెసీఆర్ రాజకీయంగా బద్ధ శత్రువులు అయినా, తెలుగు మహా సభలకు తెలుగురాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలవకపొవడం దారుణం.