రామ్చరణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సమంత కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక ప్రస్తుతం విశాఖ ఆర్కే బీచ్లో జరుగుతుంది.
ఏ సినిమా అయినా, అభిమానుల్లో అంచనాలు వుంటాయి. రంగస్థలం విషయంలో మాత్రం మెగా అభిమానులు కొద్దిగా భయం భయంగా వున్నారు. కారణం అజ్ఞాతవాసి. ఆ సినిమా ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు.
మెగా ఫ్యామిలీ మాత్రం ‘రంగస్థలం’ సినిమా మీద చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది.